స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని ఏపీ సీఎం చంద్రబాబు ఘనంగా నివాళులు అర్పించారు. “శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీకు బానిస అవుతుంది” అంటూ అద్భుతమైన సందేశాన్ని ఇచ్చిన స్వామి వివేకానంద జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్న యువతీ యువకులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో, పేదరిక నిర్మూలనలో, సమసమాజ స్థాపనలో యువశక్తి భాగస్వామి కావాలని ఈసందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. శక్తివంతమైన సోషల్ మీడియా, ఇంటర్ నెట్, ఏఐ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేయకుండా మీ అభివృద్ధి కోసం ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ ఐదేళ్ళలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేందుకు నిత్యం శ్రమిస్తున్నాం. అలాగే ఇంటికో పారిశ్రామికవేత్తను తయారుచేసే లక్ష్యంతో కార్యక్రమాలు రూపొందిస్తున్నాం. దేశంలో మొదటిసారిగా స్కిల్ సెన్సెస్ చేపడుతున్నాం. మీరు లక్ష్యాలను నిర్దేశించుకోండి. వాటిని చేరుకునేందుకు మీ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు.
Previous Articleకాలికి గాయంతో రష్మిక ఫొటో
Next Article లైవ్లో పాట పాడి.. స్టేజ్పై స్టెప్పులేసిన వెంకటేశ్