సినీ నటుడు విజయ్ రంగరాజు కన్నుమూశారు.చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.వారం రోజుల క్రితం ఓ సినిమా షూటింగ్లో గాయపడిన విజయ్ రంగరాజును చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆయనకు నేడు గుండెపోటు రావడంతో కన్నుమూశారు. 1994లో భైరవ ద్వీపం చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చిన విజయ్ రంగరాజు తెలుగు, తమిళ సినిమాల్లో విలన్, సహాయక పాత్రల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు.
విజయ్ రంగరాజు అసలు పేరు ఉదయ రాజ్కుమార్. మోహన్లాల్ హీరోగా నటించిన ‘వియత్నాం కాలనీ’ అనే మలయాళ సినిమాతో సినీరంగంలోకి అరంగేట్రం చేశారు.ఆ చిత్రం విజయం సాధించడంతో వరుసగా అవకాశాలు అందుకున్నారు. ఆ సమయంలోనే తెలుగులో ‘భైరవద్వీపం’లో విలన్గా నటించే అవకాశం వచ్చింది.ఆ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు.ఇండస్ట్రీలో అప్పటికే ఉదయ రంగరాజు అనే నటుడు ఉండడంతో తన పేరును విజయ రంగరాజుగా మార్చుకున్నారు.