దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సు రెండో రోజున ఏపీ సీఎం చంద్రబాబు పలువురు ప్రపంచస్థాయి పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అనువైన అవకాశాలను వారికి వివరించారు.
పెట్రో కెమికల్ ఇండస్ట్రీకి ఏపీ అనుకూలం
పెట్రో కెమికల్ ఇండస్ట్రీకి ఆంధ్రప్రదేశ్ ఎంతో అనుకూలం. ఇప్పటికే విశాఖలో HPCL ఉంది. త్వరలోనే రామాయపట్నంలో BPCL వస్తుంది. ఆంధ్రా ఈజ్ ది బెస్ట్ అని పెట్రో కెమికల్ ఇండస్ట్రీ ప్లేయర్స్ కూడా భావిస్తున్నారు. 2030నాటికి, దేశానికి 30% గ్రీన్ ఎనర్జీ, హైడ్రో ఎనర్జీని ఆంధ్రప్రదేశ్ అందిస్తుంది.భవిష్యత్తు మొత్తం గ్రీన్ హైడ్రోజన్దే. ఇది మరో విప్లవానికి దారి తీస్తుంది.
మార్స్క్ కంపెనీ సీఈవో విన్సెంట్ క్లర్క్తో భేటీ
ప్రపంచంలోనే అతిపెద్ద సముద్ర రవాణా కంపెనీలలో ఒకటైన డెన్మార్క్కు చెందిన మార్స్క్ కంపెనీ సీఈవో విన్సెంట్ క్లర్క్తో కీలక చర్చలు జరిపారు. వెయ్యి కిలోమీటర్ల పైనే తీరప్రాంతం కలిగి వుండటం, విస్తారంగా పోర్టులు ఉండటం… ఆంధ్రప్రదేశ్ బలమని, మానవ వనరులకు లోటు లేదని… విన్సెంట్ క్లర్క్కు సీఎం తెలిపారు.
ఎల్జీ కెమ్ సీఈవోను కలిసిన సీఎం చంద్రబాబు
దావోస్ సదస్సులో ఎల్జీ కెమ్ లిమిటెడ్ సీఈవో షిన్ హక్ చియోల్కు రాష్ట్రంలో వివిధరంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను సీఎం చంద్రబాబు వివరించారు. ఎల్జీ కెమ్ దక్షిణ కొరియాలో అతిపెద్ద కెమికల్ కంపెనీ, 1.5 బిలియన్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్లాంట్ ఏర్పాటు యోచనలో వున్న ఎల్జీ కెమ్ అనుబంధ సంస్థ ఎనర్జీని రాష్ట్రంలో నెలకొల్పాల్సిందిగా సీఎం ఈ భేటీలో కోరారు. పెట్రో కెమికల్ రంగంలో యూనిట్లు మూలపేట – విశాఖలోనూ, సెమీకండక్టర్ యూనిట్ తిరుపతిలోనూ నెలకొల్పేందుకు వున్న అవకాశాలను పరిశీలించమని సూచించారు. రాష్ట్రంలో తయారీకి అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు వేగంగా ప్లాంట్ ఏర్పాటయ్యేలా పూర్తి మద్దతిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్, దక్షిణ కొరియా మధ్య పెట్టుబడుల కోసం ఎల్జీ కెమ్ సీఈవోను అంబాసిడర్గా ఉండాలని అభ్యర్ధించారు.
ఏపీ రైతులతో భాగస్వామి కావాలి:కార్ల్స్ బెర్గ్ గ్రూప్ సీఈవో జాకబ్ ఆరుప్ ఆండర్సన్ తో సీఎం చంద్రబాబు
పండ్ల రసాలు, శీతల పానీయాలు, బీర్లు, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్, ఉత్పత్తి చేసే కార్ల్స్ బెర్గ్ గ్రూప్ సీఈవో జాకబ్ ఆరుప్ ఆండర్సన్తోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చర్చలు జరిపారు. ఇంటిగ్రేటెడ్ బ్రూవరీ, బాట్లింగ్ యూనిట్ను రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు. ఇందుకోసం విశాఖపట్నం, కృష్ణపట్నం, శ్రీ సిటీలోని ఇండస్ట్రియల్ పార్కులను పరిశీలించాలని చెప్పారు. బార్లీ, మొక్కజొన్న, వరి వంటి అధిక నాణ్యమైన ఆహార ఉత్పత్తులను సేకరించేందుకు ఆంధ్రప్రదేశ్లోని రైతులతో భాగస్వామి కావాల్సిందిగా కోరారు.
ఆంధ్రప్రదేశ్ లో ప్రతిభకు లోటు లేదు:సిస్కో చైర్మన్, సీఈవో చుక్ రాబిన్స్తో సీఎం చంద్రబాబు
ఈథర్నెట్, ఆప్టికల్, వైర్లెస్, మొబిలిటీ వంటి నెట్వర్కింగ్లో సాంకేతికతలను అందించడం, డేటా సెంటర్లు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో పేరున్న మల్టీ-నేషనల్ టెక్నాలజీ సంస్థ సిస్కో చైర్మన్, సీఈవో చుక్ రాబిన్స్తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. టెక్నాలజీ ఇన్నోవేషన్లో గ్లోబల్ లీడర్గా వున్న సిస్కో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వామి కావాలని చుక్ రాబిన్స్ వద్ద సీఎం తన ఆకాంక్ష వ్యక్తం చేశారు. విశాఖపట్నం లేదా తిరుపతిలో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ (GCC) ఏర్పాటుకు యోచన చేయమని… రాష్ట్రంలో ప్రతిభకు లోటు లేదని చెప్పారు. APలో నెట్వర్క్ భాగాల తయారీకి ఆహ్వానించారు.
పెట్టుబడుల సాధనే లక్ష్యంగా పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు సమావేశాలు
By admin2 Mins Read