ఈ సంక్రాంతికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే, ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.చివరికి మిక్సడ్ టాక్తో సరిపెట్టుకుంది.ఇక ఈ చిత్రాన్ని టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు తన నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై భారీ బడ్జెట్తో నిర్మించిన విషయం తెలిసిందే.అయితే ఈ సినిమా సక్సెస్ కాలేకపోయింది.
దీనితో ఇదే బ్యానర్లో చెర్రీ దిల్ రాజు కోసం మరో చిత్రం చేయనున్నారు అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి.తాజాగా ఇవన్నీ పుకార్లేనని సంబంధిత వర్గాలు తేల్చేశాయి.ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని పేర్కొన్నాయి.ప్రస్తుతానికి అలాంటి ప్లాన్స్ ఏవీ చరణ్ వద్ద లేవని,ఆయన చేతిలో కేవలం ఆర్సీ 16, 17 చిత్రాలు మాత్రమే ఉన్నాయని స్పష్టం చేశాయి.బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్సీ 16’ తర్వాత చెర్రీ ‘ఆర్సీ 17’లో నటించనున్నారు. ఇది ప్రముఖ దర్శకుడు సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కనుంది.