ఇటీవల ‘డాకు మహారాజ్’తో భారీ విజయాన్ని అందుకున్నాడు డైరెక్టర్ బాబీ కొల్లి.ఈ నేపథ్యంలో ఆయన తదుపరి చిత్రం ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.తాజాగా మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా బాబీ కొల్లి ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారని సమాచారం.ఇంతకుముందు వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది.
అయితే ఈ చిత్రం చిరంజీవి కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది.ఈ నేపథ్యంలో వీరిద్దరి కలయికలో మరో చిత్రం రానుందని తెలుస్తుంది.ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుందని తెలిసింది.ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయని సమాచారం.చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’లో నటిస్తున్నారు.మేలో ప్రేక్షకుల ముందుకురానుంది.దీని తర్వాత ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నారు.ఈ చిత్రం పూర్తయ్యాకే బాబీ కొల్లి తెరకెక్కించే చిత్రం పట్టాలెక్కే అవకాశముందని తెలుస్తుంది.