ఇటీవల ఒక కేసులో అరెస్టయిన మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీని విజయవాడ సబ్ జైలులో పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన విమర్శలను టీడీపీ నేతలు తిప్పికొడుతున్నారు. తాజాగా ఏపీ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. నిజం చెబితే తల వెయ్యి ముక్కలు అవుతుందనే శాపం మీకేమైనా ఉందా జగన్ రెడ్డి గారు? పచ్చి అబద్దాలను కాన్ఫిడెంట్ గా చెప్పడంలో మీరు పీహెచ్డీ చేసినట్టు ఉన్నారు. మీరు ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారు అనే భ్రమలోంచి ఇకనైనా బయటకు రండి. 100 మందికి పైగా వైసీపీ రౌడీలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై దాడి చేయడం కోట్లాది ప్రజలు కళ్లారా చూసారు. కక్ష సాధింపు, కుట్రలు, కుతంత్రాలు మీ బ్రాండ్ జగన్ అంటూ లోకేష్ కౌంటర్ ఇచ్చారు. అధికారం ఉన్నప్పుడు యథేచ్చగా చట్టాలను తుంగలో తొక్కి… ఇప్పుడు ప్రజాస్వామ్యం, పద్ధతులు అంటూ మీరు లెక్చర్ ఇవ్వడం వింతగా ఉందంటూ లోకేష్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
నిజం చెబితే తల వెయ్యి ముక్కలు అవుతుందనే శాపం మీకేమైనా ఉందా జగన్ రెడ్డి గారు? పచ్చి అబద్దాలను కాన్ఫిడెంట్ గా చెప్పడంలో మీరు పీహెచ్డీ చేసినట్టు ఉన్నారు. మీరు ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారు అనే భ్రమలోంచి ఇకనైనా బయటకు రండి. 100 మందికి పైగా వైసీపీ రౌడీలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై… pic.twitter.com/QyaWD0IAgb
— Lokesh Nara (@naralokesh) February 18, 2025