చేనేత కళాకారులకు 200 యూనిట్లు, పవర్ లూమ్ ఉన్నవారికి 500 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వాలనే ప్రతిపాదనకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన మంత్రిమండలి ఆమోదముద్ర వేయడం పట్ల మంత్రి లోకేష్ హార్షం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన 9 నెలలలోగానే నేను ఇచ్చిన మాటను మంత్రిమండలి కార్యరూపంలో పెట్టడం మా ఎన్డీఏ ప్రభుత్వం నిబద్ధతకు నిదర్శనమైన పేర్కొన్నారు.ఒక హామీ నెరవేర్చితే ఏదో నా బాధ్యత తీరిపోయినట్టు కాదు.. భారం దించుకున్నట్టు కాదు.. లక్షలాది బతుకులకు అది వెలుగు దారి కావాలనే నా ఆశయం నెరవేరుతుందనే ఆనందం ఇదని లోకేష్ సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.
2019 ఎన్నికలలో మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి తక్కువ ఓట్లతో ఓడిపోయానన్న లోకేష్ అయినా నియోజకవర్గాన్ని వీడిపోలేదని ఆ రోజు నుండి నియోజకవర్గంలో ప్రజల్లో ఒకడిగా మారానన్నారు. మంగళగిరిలో చేనేత కళాకారుల కుటుంబాలు చాలా ఎక్కువ. వారి ఇళ్లకు, పని ప్రదేశాలకు వెళ్లేటప్పుడు అందమైన వస్త్రాలను నేసే వారి జీవితాలలో కష్టాలను చూశాను. యువగళం పాదయాత్రలో ధర్మవరం, వెంకటగిరి చేనేతల సమస్యలు విన్నాను. రాష్ట్రవ్యాప్తంగా చేనేతలందరూ పడుతున్న ఇబ్బందులు కళ్లారా చూశాక చేనేతలకు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చాను. మాట నిలబెట్టుకుని చేనేతలకు చేదోడుగా నిలిచినట్లు పేర్కొన్నారు. తాను ఎక్కడికి వెళ్లినా.. ఏ అతిథిని కలిసినా మంగళగిరి చేనేత కళాకారులు నేసిన శాలువాతోనే సత్కరిస్తాను. చేనేత వస్త్రాలకు విస్తృత మార్కెటింగ్ కల్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు వివరించారు.
Previous Articleఅల్లరి నరేష్ కొత్త చిత్రం ‘12ఏ రైల్వే కాలనీ’ టీజర్ విడుదల
Next Article లండన్ చేరుకున్న మెగాస్టార్ చిరంజీవి…!

