ఉన్నత విద్యనభ్యసించే బాలికల కోసం కలలకు రెక్కలు పథకాన్ని ఈ ఏడాది నుంచే ప్రారంభించేందుకు విధివిధానాలు రూపొందించాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. పాఠశాల, ఇంటర్మీడియట్, ఉన్నత విద్య శాఖల ఉన్నతాధికారులతో ఉండవల్లి నివాసంలో ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ వివిధ అంశాలపై సుదీర్ఘంగా సమీక్షించారు. డీఎస్సీ పరీక్షలు నిర్వహించే కేంద్రాలతోపాటు టిసిఎస్ ఆయాన్ సెంటర్లలో కంప్యూటర్లతో పాటు ఇతర సదుపాయాలు కల్పించాలని, డీఎస్సీ కాల్ సెంటర్లలో ఎలాంటి కాల్ సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలి. పదోతరగతి పరీక్షా ఫలితాలపైనా సమీక్షించారు. ఉత్తమ విద్యార్థులను షైనింగ్ స్టార్స్ పేరిట సన్మానానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి టెక్స్ట్ బుక్స్, విద్యార్థి మిత్ర కిట్స్ సిద్ధం చేయాలని అంబేద్కర్ విదేశీ విద్య పథకం తిరిగి ప్రారంభానికి విధివిధానాలు రూపొందించాలని ఆదేశించారు. ఫీజు రీఎంబర్స్ మెంట్ సొమ్మును ప్రతి క్వార్టర్ కు విడుదల చేస్తామని పేర్కొన్నారు.
‘కలలకు రెక్కలు’ పథకానికి విధివిధానాలు రూపొందించండి: అధికారులతో సమీక్షలో మంత్రి లోకేష్
By admin1 Min Read