ఐపీఎల్ సీజన్ 18 లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ముంబై ఇండియన్స్ జైత్రయాత్రకు బ్రేక్ పడింది. తాజాగా గుజరాత్ టైటాన్స్ తో ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్ లో గుజరాత్ నెగ్గింది. మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. విల్ జాక్స్ 53 (35; 5×4, 3×6) హాఫ్ సెంచరీతో రాణించాడు. సూర్య కుమార్ యాదవ్ (35), కార్బిన్ బాస్ (27) పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో సాయి కిషోర్ 2 వికెట్లు, సిరాజ్, అర్షద్ ఖాన్, కొయిట్జీ, ప్రసీద్ కృష్ణ, రషీద్ ఖాన్ ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు. అనంతరం వర్షం కారణంగా మ్యాచ్ లో డక్ వర్త్ లూయిస్ ప్రకారం గుజరాత్ టార్గెట్ ను 19 ఓవర్లలో 147 పరుగులుగా నిర్ణయించారు. గుజరాత్ సరిగ్గా 19 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ శుభ్ మాన్ గిల్ (43), జాస్ బట్లర్ (30), రూథర్ఫోర్డ్ (28) పరుగులతో రాణించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు