అగ్ర కధానాయకుడు మెగాస్టార్ చిరంజీవి వినోదాత్మక చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఒక చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఘనంగా పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈచిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటించనున్నారో మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. నయనతార మెగాస్టార్ సరసన కథానాయికగా నటిస్తున్నట్లు తెలిపింది. #మెగా 157 లో ఆమె అలరించనున్నట్లు మూవీ నిర్మాణ సంస్థ సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ఈసినిమాను సుస్మితా కొణిదెల, సాహూ గారపాటి నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరీలియో సంగీతం అందిస్తున్నారు.
Welcoming the ever graceful queen, #Nayanthara garu to our #Mega157 journey as she brings her brilliance and elegance alongside our Megastar @KChiruTweets garu once again ❤️
— https://t.co/P5SFAMwNKR#ChiruAnil SANKRANTHI 2026 – రఫ్ఫాడించేద్దాం pic.twitter.com/xuluceoZ9G
— Anil Ravipudi (@AnilRavipudi) May 17, 2025