ఐపీఎల్ సీజన్ 18 లో ఇప్పటివరకు పేలవంగా ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ తన చివరి మ్యాచ్ లో 83 పరుగుల తేడాతో అదిరే విజయంతో సత్తా చాటింది. గుజరాత్ టైటాన్స్ పై చెన్నై బ్యాటర్లు విజృంభించి ఆడారు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో పరుగుల సునామీ సృష్టించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఏకంగా 230 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. డెవాల్డ్ బ్రెవిస్ (57), డెవాన్ కాన్వే (52) అద్భుత హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఉర్విల్ పటేల్ (37), ఆయుష్ మాత్రే (34), జడేజా (21) పరుగులు చేశారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో ప్రసీద్ కృష్ణ 2 వికెట్లు, రషీద్ ఖాన్, సాయి కిషోర్, షారుఖ్ ఖాన్ ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో గుజరాత్ 18.3 ఓవర్లలో 147 పరుగులకే కుప్పకూలింది. సాయి సుదర్శన్ (41), అర్షద్ ఖాన్ (20) మినహా మిగిలిన బ్యాటర్లు పెద్దగా పరుగులు చేయలేకపోయారు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో కాంబోజ్ 3 వికెట్లు, నూర్ అహ్మద్ 3 వికెట్లు, జడేజా 2 వికెట్లు, పతిరణ, ఖలీల్ అహ్మద్ ఒక్కో వికెట్ తీశారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు