ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ లో భారత మిక్స్డ్ రిలే టీమ్ గోల్డ్ మెడల్ నిలబెట్టుకుంది. వ్యక్తిగత విభాగాలలో భారత అథ్లెట్స్ నలుగురికి సిల్వర్ మెడల్స్ దక్కాయి. ఒకరు బ్రాంజ్ మెడల్ సొంతం చేసుకున్నారు. దీంతో భారత్ రెండో రోజు మొత్తం 6 మెడల్స్ సాధించింది. 4×400 మిక్స్డ్ రిలే పోటీలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. సంతోష్ కుమార్, రూపల్ చౌదరి, విశాల్, శుభ వెంకటేశ్ లో టీమ్ 3 నిమిషాల 18.12 సెకన్లలో రేసు పూర్తి చేసింది. చైనా రెండో స్థానంలో నిలిచి సిల్వర్, శ్రీలంక మూడో స్థానంతో బ్రాంజ్ మెడల్ సొంతం చేసుకున్నాయి. పురుషుల డెకాథ్లాన్ లో తేజస్విన్ శంకర్ 7518 పాయింట్లతో సిల్వర్ మెడల్ సాధించాడు. మెన్స్ ట్రిపుల్ జంప్ లో ప్రవీణ్ చిత్రవేల్ సిల్వర్, మహిళల 400 మీటర్ల రేసులో రూపల్ చౌదరి, 1500 మీ రన్ లో పూజ సిల్వర్ మెడల్స్ సాధించారు. మెన్స్ 1500 మీ రేసులో యూనుష్ షా బ్రాంజ్ మెడల్ గెలిచాడు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు