టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీలో భాగంగా లీడ్స్ వేదికగా జరుగుతున్న భారత్-ఇంగ్లాండ్ మొదటి టెస్టు హోరాహోరీగా సాగుతోంది. భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 471 (113 ఓవర్లలో) పరుగులకు ఆలౌటయింది. రెండో రోజు ఓవర్ నైట్ స్కోరుతో బ్యాటింగ్ ఆరంభించిన భారత్ ఇన్నింగ్స్ లో రిషబ్ పంత్ బ్యాటింగ్ హైలెట్ గా నిలిచింది. రిషబ్ పంత్ 134 (178; 12×4, 6×6) సెంచరీతో రాణించాడు. మొదటి ఇన్నింగ్స్ లో యశస్వీ జైశ్వాల్ 101 (158; 16×4, 1×6), శుభ్ మాన్ గిల్ 147 (227; 19×4, 1×6) లు కూడా సెంచరీలతో ఆకట్టుకున్నారు. కే.ఎల్. రాహుల్ (42), సాయి సుదర్శన్ (0), కరుణ్ నాయర్ (0) లు నిరాశ పరిచారు. జడేజా (11), శార్థుల్ ఠాకూర్ (1) స్వల్ప పరుగులు మాత్రమే చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో టంగ్ 4 వికెట్లు, స్టోక్స్ 4 వికెట్లు, కార్స్, బషీర్ ఒక్కో వికెట్ చొప్పున తీశారు. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లాండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. పోప్ 100 నాటౌట్ (131; 13×4) సెంచరీతో అజేయంగా నిలిచాడు. డకెట్ 62 (94; 9×4) హాఫ్ సెంచరీతో రాణించాడు. క్రాలీ (4), రూట్ (28) పరుగులు చేశారు. పోప్ తో పాటు బ్రూక్ (0) నాటౌట్ క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ 262 పరుగుల వెనుకంజలో ఉంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు