ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలో 4 రోజులపాటు విజయవంతంగా సింగపూర్ లో పర్యటన పూర్తిచేశామని ఉండవల్లి నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాబోయే ఐదేళ్లలో గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ ఇన్వెస్టిమెంట్ కార్పొరేషన్ (జిఐసి) సింగపూర్ సావరిన్ ఫండ్ ద్వారా ఏపీలో రూ.45 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొన్నారు. ఇది రాష్ట్రంలో యువతకు గుడ్ న్యూస్, జగన్ కు బ్యాడ్ న్యూస్. రాష్ట్రానికి పెట్టుబడుల సాధన, బ్రాండ్ ఇమేజ్ ను పెంచడమే లక్ష్యంగా సింగపూర్ పర్యటన సాగిందని వివరించారు. సింగపూర్ లో తెలుగువారు ఘనస్వాగతం పలికారు. రాబోయే రోజుల్లో పెద్దఎత్తున పెట్టుబడులు రాబోతున్నాయని ఈ సందర్భంగా వివరించారు.
పెట్టుబడుల సాధన, బ్రాండ్ ఇమేజ్ ను పెంచడమే లక్ష్యంగా సింగపూర్ పర్యటన: మంత్రి లోకేష్
By admin1 Min Read