ఆసియా షూటింగ్ ఛాంపియన్ షిప్ లో భారత్ బోణీ కొట్టింది. పురుషుల ఎయిర్ పిస్టల్ టీమ్ విభాగంలో సిల్వర్ మెడల్ గెలుచుకుంది. అన్మోల్ (580), ఆదిత్య మాల్రా (579), సౌరభ్ చౌదరి (576)లతో కూడిన భారత జట్టు 1735 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. చైనా (1744) గోల్డ్ మెడల్ సాధించింది. ఇరాన్ (1733) కాంస్యాన్ని కైవసం చేసుకుంది. పురుషుల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో అన్మోల్ ఆరో స్థానంలో నిలిచాడు. ఆదిత్య (579), సౌరభ్ చౌదం (576) క్వాలిఫికేషన్లోనే వెనుదిరిగారు. 20 ఏళ్ల అమిత్శర్మ క్వాలిఫికేషన్లో 588 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. జూనియర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో కపిల్ పసిడి గెలిచాడు. ఫైనల్లో 243 పాయింట్లతో అతడు అగ్రస్థానంలో నిలిచాడు. ఇదే విభాగంలో మరో భారత్ కు చెందిన గవిన్ ఆంథోని (220.7) కాంస్యం గెలుచుకున్నాడు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు