తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో నేడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం వివరాలను బీఆర్ నాయుడు మీడియాకు వెల్లడించారు. సర్వదర్శనానికి వచ్చే భక్తులకు 2 నుండి 3 గంటల్లోగా దర్శనం కల్పించేలా చర్యలు తీసుకోవాలని టీటీడీ నిర్ణయించింది. ఇక టీటీడీలో పని చేస్తున్న అన్యమత ఉద్యోగులను ప్రభుత్వానికి అప్పగించనుంది. ఈ మేరకు శ్రీవాణి ట్రస్టు రద్దు చేయాలని నిర్ణయించారు. శ్రీనివాస సేతు పైవంతెనకు గరుడ వారధిగా నామకరణం చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. తిరుమల డంపింగ్ యార్డులోని చెత్తను 3 నెలల్లో తొలగించనున్నట్లు పేర్కొన్నారు. ప్రైవేటు బ్యాంకుల్లో నగదును ప్రభుత్వ బ్యాంకుల్లోకి బదలాయించడం. శారదాపీఠం లీజును రద్దు చేసి స్థలాన్ని స్వాధీనం చేసుకోనున్నట్లు తెలిపారు. పర్యాటకం ద్వారా దర్శన టికెట్లను పూర్తిగా రద్దు చేస్తున్నాం. నూతనంగా నిర్మిస్తున్న ముంతాజ్ హోటల్ అనుమతులు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. తిరుపతి ప్రజలకు ప్రతినెల మొదటి మంగళవారం దర్శనానికి అవకాశం కల్పించనున్నట్లు బీఆర్ నాయుడు తెలిపారు.
Previous Articleనేటి ట్రేడింగ్ ను నష్టాలతో ముగించిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
Next Article పలు కీలక బిల్లులకు ఏపీ శాసనసభ ఆమోదం

