భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే జరిగిన పెర్త్ వేదికగా జరిగిన మొదటి టెస్ట్ లో ఘన విజయం సాధించి1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇదిలా ఉండగా తాజాగా ప్రధాని ఆంథోని ఆల్బనీస్ ను భారత ఆటగాళ్ల బృందం కలిసింది. ప్రైమ్మినిస్టర్స్ XI జట్టుతో ఈనెల 30 నుండి రెండు రోజుల వార్మప్ మ్యాచ్ ను భారత్ ఆడనుంది. ఈ క్రమంలో కాన్ బెర్రాలోని పార్లమెంట్ హౌస్ లో ఆల్బనీస్ తో భారత క్రికెటర్లు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అందరితో ఫొటోలు దిగుతూ ప్రధాని సందడి చేశారు. క్రికెటర్లతో దిగిన ఫొటోలను ఆల్బనీస్ సోషల్ మీడియా ద్వారా పంచుకొన్నారు. “భారత్ తో ఆడటం ప్రైమ్ మినిస్టర్స్ XIకు పెద్ద ఛాలెంజే. అయితే, ప్రధాని మోడీకి చెప్పినట్లుగా మా వాళ్లు అద్భుతంగా రాణించేలా నేను అండగా ఉంటానని వ్యాఖ్యానించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు