బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లకు సంబంధించి 29 మంది సినీ ప్రముఖులు, సంస్థలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులు నమోదు చేసింది. సినీ నటులు రానా, మంచు లక్ష్మి, ప్రకాశ్ రాజ్, నిధి అగర్వాల్, విజయ్ దేవరకొండ, అనన్య నాగళ్ల, శ్రీముఖి తదితరులపై సైబరాబాద్ పోలీసుల ఎస్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ జరపనుంది. సినీ సెలబ్రిటీలు, యూట్యూబర్స్, ఇన్ఫ్లూయెన్సర్లను పీఎంఎల్ఎ కింద విచారించనుంది.
నిషేధిత బెట్టింగ్ అప్లికేషన్ లకు ప్రచారం చేసిన అంశంలో యాంకర్లు, టీవీ నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల నుంచి సినీ ప్రముఖుల వరకూ అందరిపైనా ఇప్పటికే తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేశారు. నటులు రానా దగ్గుబాటి, ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, శ్యామల, బుల్లితెర నటులు, ఇన్ఫ్లుయెన్సర్లు శ్రీముఖి, వర్షిణి సౌందరరాజన్, వసంతి కృష్ణన్, శోభాశెట్టి, అమృతాచౌదరి, నయనిపావని, నేహాపఠాన్, సిరి హనుమంతు, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్షసాయి, భయ్యా సన్నీ యాదవ్, టేస్టీ తేజ, రీతూచౌదరి, బండారు సుప్రీత తదితరుల పేర్లను ఎఫ్ఎఆర్లో చేర్చారు. బీఎన్ఎస్ లోని 318(4), 112, రెడ్విత్ 49. తెలంగాణ గేమింగ్ యాక్ట్లోని 3, 3(ఎ), 4 సెక్షన్లు, ఐటీ చట్టం 2000, 2008లోని 66డి సెక్షన్ల కింద ఈ కేసు నమోదైంది. హైదరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఎఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేయనుంది. చట్టవిరుద్ధ యాప్లను డౌన్లోడ్ చేసుకోవాలంటూ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు విస్తృతంగా ప్రచారం చేశారని ఆరోపణలున్నాయి. దానికి వారు భారీగా కమీషన్, పారితోషికం తీసుకున్నారని పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ యాప్ ల కారణంగా అప్పులపాలై అనేక మంది ఆత్మహత్యలు చేసుకోగా, చాలా కుటుంబాల్లో ఆర్ధిక సంక్షోభంలోకి వెళ్లాయని పోలీసులు పేర్కొన్నారు.
బెట్టింగ్ యాప్స్: పలువురు సినీ,టీవీ ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లపై ఈడీ కేసు
By admin1 Min Read