యాంకర్ సుమ కొడుకు రోషన్ కనకాల కథానాయకుడిగా ‘కలర్ ఫొటో’ ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ఫిల్మ్ ‘మోగ్లీ’. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.తాజాగా ఈ చిత్రం పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది.ఈ కార్యక్రమానికి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ,శ్రీకాంత్ ఓదెల అతిధులుగా హాజరయ్యారు.సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రానికి క్లాప్ కొట్టగా..శ్రీకాంత్ ఓదెల కెమెరా స్విచ్చాన్ చేశారు.వచ్చే నెలలో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలిపారు.ఇందులో సాక్షి సాగర్ మదోల్కర్ కథానాయికగా నటిస్తోంది.ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ విడుదల రానుంది.కాలభైరవ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.






