కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ సీఈవో ఎస్. రవికుమార్ తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ బెల్వడేర్ లో సమావేశమయ్యారు. అనంతరం కాగ్నిజెంట్ నుండి త్వరలోనే గుడ్ న్యూస్ రాబోతోందని తెలిపారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ ను ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, బయో టెక్నాలజీ, రెన్యువబుల్ ఎనర్జీలో డీప్ టెక్ హబ్ గా తీర్చిదిద్దాలని నిర్ణయించాం. విశాఖ, విజయవాడ, తిరుపతిలో 2.2 మిలియన్ చదరపు అడుగుల కో వర్కింగ్ స్పేస్ అందుబాటులో ఉందని ఈ సందర్భంగా వారికి వివరించారు. కాగ్నిజెంట్ గ్రోత్ స్ట్రాటజీ, ప్రాంతీయ విస్తరణ ప్రణాళికల్లో భాగంగా విశాఖపట్నం వంటి టైర్ -2 నగరాల్లో కార్యకలాపాలు ప్రారంభించాలని కోరారు. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటివాటిలో హై స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ను తయారుచేయడానికి ఏపీ ప్రభుత్వంతో భాగస్వామ్యం వహించాలని కోరారు.
కాగ్నిజెంట్ నుండి త్వరలోనే గుడ్ న్యూస్:సీఈవో ఎస్. రవికుమార్ తో మంత్రి లోకేష్ భేటీ
By admin1 Min Read