ప్రధాని నరేంద్రమోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని సమావేశం కావడం ఇది మూడోసారి.కాగా సీఎం రేవంత్ వెంట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు,ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.ఈ అయితే ఈ సమావేశంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ లో చిక్కుకున్న 8 మంది కార్మికులను బయటకు తీసుకువచ్చేందుకు చేస్తున్న సహాయక కార్యక్రమాలను ప్రధాని నరేంద్రమోదీకి రేవంత్ రెడ్డి వివరించినట్లు తెలుస్తుంది.అలానే బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ అంశాలను ప్రధానికి సీఎం వివరించారని సమాచారం.
Previous Articleసూడాన్ లో కుప్పకూలి సైనిక విమానం …10 మంది దుర్మరణం ..!
Next Article ఒకే వేదికపై విజయ్ – ప్రశాంత్ కిషోర్ …!