తాజాగా కర్ణాటక నుండి ఆంధ్రప్రదేశ్ కు కుంకీ ఏనుగులను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. నిన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎం, కర్ణాటక అటవీశాఖ మంత్రి ఏనుగులను అప్పగించే కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, దీనిపై ఏపీ మంత్రి, టీడీపీ అగ్రనేత లోకేష్ సోషల్ మీడియా లో స్పందించారు. ఉమ్మడి చిత్తూరుజిల్లాలో రైతు సోదరుల కష్టాలకు చెక్ పెట్టేందుకు కర్నాటక నుంచి కుంకీ ఏనుగులను రప్పించిన డిప్యూటీ సీఎం పవనన్నకు నా శుభాభినందనలు. యువగళం పాదయాత్ర సందర్భంగా ఏనుగుల విధ్వంసంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని పలమనేరు ప్రాంత రైతన్నలు నా దృష్టికి తెచ్చారు. రైతాంగం ఇక్కట్లను తొలగించేందుకు పవనన్న ప్రత్యేకంగా చొరవచూపి కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించారు. ఏపీ అవసరాలకు మరిన్ని కుంకీ ఏనుగులు ఇస్తామని హామీ ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వానికి కూడా నా కృతజ్ఞతలు అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.
కర్నాటక నుంచి కుంకీ ఏనుగులను రప్పించిన డిప్యూటీ సీఎం పవనన్నకు నా శుభాభినందనలు: మంత్రి లోకేష్
By admin1 Min Read