ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈసందర్భంగా కేంద్ర మంత్రులతో వరుసగా ఆయన సమావేశమవుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర పర్యాటకశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తో ఆయన భేటీ అయ్యారు. అనంతరం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ గజేంద్రసింగ్ అంటే తనకు ఎంతో గౌరవమని పేర్కొన్నారు. గతంలో ఆయన జలశక్తి మంత్రిగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు కోసం ఎంతగానో సహకరించినట్లు గుర్తు చేసుకున్నారు. ఏపీ పర్యాటక రంగానికి సంబంధించి షెకావత్ కు 7 ప్రాజెక్టులపై ప్రతిపాదనలు అందించినట్లు తెలిపారు. తమ ప్రతిపాదనలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని అన్నారు. గండికోటను ఇండియన్ గ్రాండ్ కేనియన్ లా అభివృద్ధి చేయవచ్చని పేర్కొన్నారు. రాష్ట్రంలో పర్యాటక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి మని కోరామని తెలిపారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఢిల్లీ పర్యటన: కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు పలు ప్రాజెక్టులపై ప్రతిపాదనలు
By admin1 Min Read