2024 ఏడాదికి ప్రతిష్టాత్మక క్రీడా పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం నేడు ప్రకటించింది. నలుగురు క్రీడాకారులకు ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు లు, 32 అర్జునా అవార్డులు, 5 ద్రోణాచార్య అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 17న ఉదయం 11గంటలకు రాష్ట్రపతి భవన్ లో ఏర్పాటు చేసే ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా వీరంతా పురస్కారాలను అందుకోనున్నారు.
ఖేల్ రత్న కు ఎంపికైన వారిలో హాకీ క్రీడాకారిణి హర్మన్ ప్రీత్ సింగ్, చెస్ లో ఇటీవల ప్రపంచ ఛాంపియన్ షిప్ గెలిచన గుకేష్, పారా అథ్లెట్ విభాగంలో ప్రవీణ్ కుమార్, షూటింగ్ విభాగంలో మను బాకర్ ఉన్నారు. 32మందికి అర్జున, ఐదుగురికి ద్రోణాచార్య పురస్కారాలకు ఎంపిక చేశారు. అర్జున పురస్కారాలు దక్కించుకున్నవారిలో 17మంది పారా అథ్లెట్స్ ఉండటం విశేషం.
అర్జున అవార్డులు:
జ్యోతి యర్రాజి (అథ్లెటిక్స్), అన్ను రాణి (అథ్లెటిక్స్), నీతు (బాక్సింగ్), ప్రణవ్ సూర్మ (పారా అథ్లెటిక్స్),హెచ్. హోకాటో సీమ (పారా అథ్లెటిక్స్), సిమ్రాన్ (పారా అథ్లెటిక్స్),నవ్లీప్ (పారా అథ్లెటిక్స్),నితీశ్ కుమార్ (పారా బ్యాడ్మింటన్),తులసీమతి మురుగేశన్ (పారా బ్యాడ్మింటన్),నిత్య శ్రీ సుమతి శివన్ (పారా బ్యాడ్మింటన్),మనీశా రాం దాస్ (పారా బ్యాడ్మింటన్)కపిల్ పర్మార్ (పారా జుడో) మోనా అగర్వాల్ (పారా షూటింగ్) సరబ్జోత్ సింగ్ (షూటింగ్), ప్రీతి పాల్ (పారా అథ్లెటిక్స్) జీవాంజి దీప్పతి (పారా అథ్లెటిక్స్),అజీత్సంగ్ (పారా అథ్లెటిక్స్),సచిన్ సర్జేరావు ఖిలారి (పారా అథ్లెటిక్స్),అభయ్ సింగ్ (స్క్వాష్) సజన్ ప్రకాశ్ (స్విమ్మింగ్)అమన్ (రెజ్లింగ్) రాకేశ్ కుమార్ (పారా ఆర్చర్),స్వీటీ బురా (బాక్సింగ్),వంతిక అగర్వాల్ (చెస్),సలీమా (హాకీ), అభిషేక్ (హాకీ),సంజయ్ (హాకీ),,జర్మన్ ప్రీత్ సింగ్ (హాకీ), సుఖ్జీత్ సింగ్ (హాకీ) స్వప్నిల్ సురేష్ కుసాలే (షూటింగ్), రుబినా ప్రాన్సిస్ (పారా షూటింగ్).
అర్జున అవార్డ్స్ (లైఫ్ టైమ్):
సుచా సింగ్ (అథ్లెటిక్స్), మురళీకాంత్ రాజారాం పెట్కర్ (పారా స్విమ్మింగ్)
ద్రోణాచార్య అవార్డులు (కోచ్ లకు ఇచ్చే పురస్కారం)
1.సుభాష్ రాణా (పారా షూటింగ్)2.దీపాలీ దేశ్ పాండే (షూటింగ్)
3. సందీప్ సంగ్వాన్ (హాకీ)
లైఫ్ఎం కేటగిరీ
4.మురళీధరన్ (బ్యాడ్మింటన్)
5.అర్మాండో ఆగ్నెలో కొలాకో (ఫుట్ బాల్).

