మహిళల అండర్ 19 టీ20 ప్రపంచ కప్ లో భారత్ మరో అతి భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. తాజాగా స్కాట్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ 150 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 208 పరుగులు చేసింది. గొంగడి త్రిష 110 నాటౌట్ (59; 13×4, 4×6) సెంచరీతో అదరగొట్టింది. కమలినీ 51 (42; 9×4) హాఫ్ సెంచరీతో రాణించింది. సానికా 29 (20; 5×4) పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో స్కాట్లాండ్ 14 ఓవర్లలో 58 పరుగులకే కుప్పకూలింది. ఏ బ్యాటర్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించలేదు. భారత బౌలర్లలో ఆయుషీ శుక్లా 4 వికెట్లు, వైష్ణవి శర్మ 3 వికెట్లు, గొంగడి త్రిష 3 వికెట్లు పడగొట్టి అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ త్రిష సత్తా చాటింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు