ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ మరో మ్యాచ్ విజయంతో సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. గ్రూప్-ఏలో చెరో రెండు మ్యాచ్ లలో విజయాలతో భారత్ న్యూజిలాండ్ జట్లు సెమీఫైనల్ చేరాయి. ఇక తాజాగా జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 236 పరుగులు చేసింది. షాంటో (77), జాకర్ అలీ (45), రిషద్ హొస్సేన్ (26), టాంజిద్ హాసన్ (24) పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ బ్రేస్ వెల్ 4 వికెట్లు, ఓరూర్కే 2 వికెట్లు, మాట్ హెన్రీ, జేమీసన్ ఒక్కో వికెట్ తీశారు. ఇక లక్ష్యాన్ని న్యూజిలాండ్ 46.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రచిన్ రవీంద్ర 122 (105; 12×4, 1×6) సెంచరీతో కివీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. టామ్ లాథమ్ (55), డేవాన్ కాన్వే (30), గ్లెన్ ఫిలిప్స్ (21) పరుగులతో రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో టస్కిన్ అహ్మద్, నహిద్ రాణా, ముసఫిజుర్ రెహమాన్, రిషద్ హొస్సేన్ ఒక వికెట్ చొప్పున పడగొట్టారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు