ఈ ఐపీఎల్ సీజన్ లో ఇప్పటికే ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకున్న చెన్నై సూపర్ కింగ్స్ మరో ఓటమిని చవిచూసింది. తాజాగా బెంగుళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో జరిగిన మ్యాచ్ లో పోరాడి ఓడింది. టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 62 (33; 5×4, 5×6), జాకబ్ బెతెల్ 55 (33; 8×4, 2×6) రాణించారు. ఆఖర్లో రొమారియా షెపర్డ్ 53 (14; 4×4, 6×6) విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగాడు. దీంతో భారీ టార్గెట్ ను చెన్నై ముందుంచింది. చెన్నై బౌలర్లలో పతిరన 3 వికెట్లు, సామ్ కరన్ 1 వికెట్, నూర్ అహ్మద్ 1 వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ ఆరంభించిన చెన్నై కూడా గట్టిగానే పోరాడింది. ఆయుష్ మాత్రే 94 (48; 9×4, 5×6) మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. రవీంద్ర జడేజా 77 నాటౌట్ (45; 8×4, 2×6) చివరి వరకు పోరాడాడు. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు మాత్రమే చేయగలిగింది. బెంగళూరు బౌలర్లలో లుంగి ఎంగిడి 3 వికెట్లు, కృనాల్ పాండ్య 1 వికెట్, యశ్ దయాళ్ 1 వికెట్ తీశారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు