భారత స్టార్ క్రికెటర్, కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని సోషల్ మీడియా లో పోస్ట్ చేశాడు. టెస్టుల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించినందుకు గర్వపడుతున్నానని తెలిపాడు. ఇన్నేళ్ల కెరీర్లో తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. 38 ఏళ్ల రోహిత్ 2013లో టెస్టుల్లోకి అరంగేట్రం చేశాడు. 67 మ్యాచ్ లు ఆడి 4301 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలున్నాయి. రోహిత్ ఇప్పటికే అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. భారత్ తరఫున ఇక వన్డేల్లో మాత్రమే అతను కొనసాగుతాడు. రోహిత్ శర్మ సారథ్యంలో భారత్ ఒకసారి ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ చేరింది. జూన్ లో భారత్ ఐదు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. అతని స్థానంలో ఎవరు కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరిస్తారో చూడాలి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు