ఈ సీజన్ లో సమిష్టిగా రాణిస్తూ అద్భుతమైన విజయాలతో దూసుకుపోతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చివరి లీగ్ మ్యాచ్లో గెలిచి టాప్-2 లోకి దూసుకెళ్లింది. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసింది. ఫామ్ తో సతమతమవుతున్న కెప్టెన్ రిషబ్ పంత్ ఈ మ్యాచ్ లో అదరగొట్టాడు. 61 బంతుల్లో 11 ఫోర్లు 8 సికైసర్లతో 118 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మిచెల్ మార్ష్ 67 (37; 4×4, 5×6) కీలక ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. బెంగళూరు బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, తుకారాం, షెపర్డ్ ఒక్కో వికెట్ చొప్పున తీశారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన బెంగళూరు 18.4 ఓవర్లలోనే 230-4 స్కోరు చేసి గెలుపును కైవసం చేసుకుంది. జితేష్ శర్మ 85 నాటౌట్ (33; 8×4, 6×6) ఆ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. విరాట్ కోహ్లీ 54 (30; 10×4) హాఫ్ సెంచరీతో రాణించాడు. మయాంక్ అగర్వాల్ 41 నాటౌట్ (23; 5×4), ఫిల్ సాల్ట్ (30) పరుగులు చేశారు. లక్నో బౌలర్లలో ఓరూర్కే 2 వికెట్లు పడగొట్టగా…ఆవేశ్ ఖాన్, ఎ.సింగ్ ఒక్కో వికెట్ తీశారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు