భారత మహిళా క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ తో జరుగుతున్న వన్డే సిరీస్ లో శుభారంభం చేసింది. ఇంగ్లాండ్ లో పర్యటిస్తున్న భారత్ ఇప్పటికే టీ20 సిరీస్ గెలిచి సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు వన్డే సిరీస్ లో భాగంగా మొదటి వన్డేలో 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 6 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. సోఫియా డంక్లీ 83 (92; 9×4), అలైస్ రిచర్డ్స్ (53( హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. భారత బౌలర్లలో క్రాంతి గౌడ్ 2 వికెట్లు, స్నేహ్ రాణా 2 వికెట్లు, శ్రీ చరణి ఒక వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనను భారత్ 48.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి పూర్తి చేసింది. దీప్తి శర్మ (62 నాటౌట్), జెమీమా రోడ్రిగ్స్ (48) రాణించడంతో భారత్ అలవోకగా విజయం సాధించింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు