దేశ ప్రతిష్టను పెంచిన నలుగురు క్రీడాకారులను మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుకు ఎంపిక చేయడం హర్షణీయమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. నేడు ప్రతిష్టాత్మక ధ్యాన్ చంద్ ఖేల్ రత్న, అర్జునా, ద్రోణాచార్య అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు స్పందించారు.
ఎయిర్ గన్ షూటింగ్ లో ఒలింపిక్స్ పతక విజేత మను భాకర్, భారతీయ గ్రాండ్ మాస్టర్, ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేష్, హాకీలో ఒలింపిక్ పతక విజేత టీమ్ సభ్యుడు హాకీ క్రీడాకారుడు హర్మన్ ప్రీత్ సింగ్, పారా అథ్లెటిక్స్ లో ఒలింపిక్ పతక విజేత ప్రవీణ్ కుమార్ లను ఈ సందర్భంగా అభినందిస్తూ ట్వీట్ చేశారు. చదరంగంలో బాల్యం నుంచే ప్రతిభ కనబరుస్తూ, చిన్న వయసులో గ్రాండ్ మాస్టర్ అయిన గుకేష్ 2024 చెస్ టోర్నమెంట్ లో విశ్వ విజేతగా నిలిచిన విషయం మనకు తెలిసిందే. ప్రతిష్టాత్మక ఖేల్ రత్న అవార్డును అందుకుంటున్న గుకేష్, తన ప్రతిభతో మరింతగా రాణించాలని ఆకాంక్షించారు. అలాగే అర్జున అవార్డ్ గ్రహీతలు విశాఖకు చెందిన అథ్లెట్ జ్యోతి యర్రాజీ, వరంగల్ కు చెందిన పారా అథ్లెట్ జీవాంజి దీప్తికి అభినందనలు తెలిపారు.
దేశ ప్రతిష్టను పెంచిన క్రీడాకారులకు ఖేల్ రత్న అవార్డు హర్షణీయం: ఏపీ సీఎం చంద్రబాబు
By admin1 Min Read
Previous Articleదబిడి దిబిడి పాట వచ్చేసింది…!
Next Article ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు