సావిత్రిబాయి పూలే 194 వ జయంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు ఘననివాళి అర్పించారు. స్త్రీ విద్యపై ప్రప్రధమంగా గళమెత్తిన ఉద్యమకారిణి, ఆదర్శ ఉపాధ్యాయురాలని కొనియాడారు. కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి, అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమించిన సావిత్రిబాయి స్ఫూర్తి మనకు ఆదర్శమని పేర్కొన్నారు. ఆనాటి కట్టుబాట్లను కాదని 1848లోనే సావిత్రిబాయి పూలే పూణేలో మొట్టమొదటి బాలికల పాఠశాలను ప్రారంభించడం అనేది అసామాన్య విషయమని పేర్కొన్నారు. ఆనాటి ఆమె చొరవ తెలుగుదేశం పార్టీ మహిళా సాధికారత సిద్ధాంతానికి ఆలంబనగా మారి మహిళా రిజర్వేషన్లకు దారి తీసిన విషయం ఈసందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు. కులమత భేదాలకు అతీతంగా సమాజం కోసం తపించిన సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మరొక్క మారు ఘననివాళి అంటూ చంద్రబాబు ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు.
స్త్రీ విద్యపై ప్రప్రధమంగా గళమెత్తిన ఉద్యమకారిణి, ఆదర్శ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 194 వ జయంతి సందర్భంగా ఘననివాళి అర్పిస్తున్నాను. కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి, అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమించిన సావిత్రిబాయి స్ఫూర్తి మనకు ఆదర్శం. ఆనాటి కట్టుబాట్లను కాదని 1848లోనే… pic.twitter.com/aKIEK2QfnC
— N Chandrababu Naidu (@ncbn) January 3, 2025