ఆరోగ్య శ్రీ పథకానికి మంగళం పాడి.. ప్రజల ఆరోగ్యంతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని ఏపీసీసీ చీఫ్ షర్మిల ఆరోపించారు. పేదవాడి ఆరోగ్యానికి భరోసా ఆరోగ్య శ్రీ. దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మానస పుత్రిక ఈ పథకం అని షర్మిల పేర్కొన్నారు. ప్రాణాలు తీసే జబ్బొచ్చినా సంజీవని లాంటి ఆరోగ్య శ్రీ పథకాన్ని.. కూటమి సర్కార్ అనారోగ్యశ్రీగా మార్చిందని ‘ఎక్స్’ వేదికగా విమర్శించారు. రూ.3వేల కోట్లు బకాయిలు చెల్లించకుండా, వైద్యసేవలు నిలిచే దాకా చూడటం అంటే ఇదంతా పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రనే అని ఆక్షేపించారు.
ఆరోగ్యానికి పెద్దపీట అంటూనే ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తూ వదిలించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం ఆరోగ్య శ్రీ పథకానికి బకాయిలు గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టినవి అయినా.. వాటిని చెల్లించే బాధ్యత ఈ ప్రభుత్వంపైనే ఉందని వెంటనే ఆసుపత్రుల యాజమాన్యాలను చర్చలకు పిలవాలని పెండింగ్ బకాయిలు రూ.3వేల కోట్లు తక్షణం విడుదల చేయాలని ఆరోగ్యశ్రీ సేవలను వెంటనే పునరుద్ధరించి, పథకానికి ఏ లోటూ రాకుండా చూడాలని సీఎం చంద్రబాబుని డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆరోగ్య శ్రీ పథకాన్ని.. కూటమి సర్కార్ అనారోగ్యశ్రీగా మార్చింది: ఏపీసీసీ చీఫ్ షర్మిల
By admin1 Min Read
Previous Articleనేపాల్ – టిబెట్ – భారత్ లో కంపించిన భూమి…!
Next Article ఏపీరెరా పెండింగ్ దరఖాస్తులపై స్పెషల్ డ్రైవ్