హైదరాబాద్ బీజేపీ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ దాడి జరిగిన నేపథ్యంలో సీఏం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని…కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు.ఈ మేరకు యూత్ కాంగ్రెస్ నేతలు బీజేపీ కార్యాలయంపై దాడి చేయడాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.మేము తలుచుకుంటే కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డు మీద కూడా తిరగలేరని హెచ్చరించారు.పోలీసులను వెంట తీసుకొచ్చి మరీ బీజేపీ కార్యాలయంపై రాళ్లు విసిరారని,పోలీసుల తీరు ఇలా ఉంటే ఎలా? అని నిలదీశారు.ఇలాంటి దుర్మార్గాలకు కేరాఫ్ అడ్రస్గా కాంగ్రెస్ మారిందని కిషన్ రెడ్డి మండిపడ్డారు.ప్రజాస్వామ్యంలో హింస, భౌతిక దాడులకు తావులేదన్నారు.
మేము తలుచుకుంటే కాంగ్రెస్ ఆఫీస్ను తగలబెడతాం:- ఎమ్మెల్యే రాజా సింగ్
నాంపల్లిలోని బీజేపీ ఆఫీస్పై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని ఆ పార్టీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఖండించారు. అటాక్ చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. తాము తలుచుకుంటే కాంగ్రెస్ ఆఫీస్ను తగలబెడతామని హెచ్చరించారు. ఈ ఘటనకు సీఎం రేవంత్ క్షమాపణలు చెప్పాలన్నారు. అసలు రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. నిరసన తెలిపే పద్ధతి ఇదేనా అని నిలదీశారు.