ప్రభుత్వ ఉద్యోగులు, రైతులు, విద్యార్థులు, చిరు వ్యాపారులు, చిన్న కాంట్రాక్టర్లు, పోలీసు సిబ్బందికి బకాయిలు చెల్లించేందుకు రూ. 6,700 కోట్లు విడుదల చేస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈనేపథ్యంలో సీఎం నిర్ణయంపై ఏపీ మంత్రి నారా లోకేష్ హార్షం వ్యక్తం చేశారు. కంసమామ మోసం చేసి పోతే మన చంద్రన్న న్యాయం చేస్తున్నారని లోకేష్ సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. జగన్ రెడ్డి గారు ఫీజు బకాయిలు పెట్టి లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడారని ఆయన పెట్టిన బకాయిలు ప్రజా ప్రభుత్వం తీర్చాలని రోడ్డెక్కిన ఘనత కూడా ఆయనకే దక్కిందని ఎద్దేవా చేశారు.
గత పాలకులు చేసిన పాపాలకు విద్యార్థులు బలి కాకూడదని తాను విద్యా శాఖా మంత్రి అయిన వెంటనే కాలేజీ యాజమాన్యాలతో చర్చలు జరిపి సర్టిఫికెట్లు ఇచ్చే ఏర్పాట్లు చేసినట్లు ఈ సందర్భంగా లోకేష్ తెలిపారు. దశల వారీగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ రూ.788 కోట్లు చెల్లించాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. పండుగ వేళ విద్యార్థులకు తీపి కబురు అందించిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి కృతజ్ఞతలు తెలిపారు.
పండుగ వేళ విద్యార్థులకు తీపి కబురు అందించిన సీఎంకు కృతజ్ఞతలు: మంత్రి లోకేష్
By admin1 Min Read