ఐఐటీ మద్రాస్ మొట్టమొదటిసారిగా ‘స్పోర్ట్స్ ఎక్స్లెన్స్ అడ్మిషన్ (ఎస్ఈఏ)’ కోటా కింద జేఈఈలో జాతీయ స్థాయిలో ప్రతిభ చాటిన ఐదుగురు విద్యార్థులకు 2024-25 విద్యా సంవత్సరంలో ప్రవేశాలు కల్పించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్లోని కర్నూలుకు చెందిన లాన్ టెన్నిస్ క్రీడాకారుడు వంగల వేదవచన్రెడ్డి బీటెక్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డాటా సైన్స్)లో సీటు పొందారు. మిగిలిన నలుగురు విద్యార్థుల్లో మహారాష్ట్ర నుంచి కుమారి అరోహి భావే (వాలీబాల్ క్రీడాకారిణి), పశ్చిమ బెంగాల్ నుంచి ఆర్యమన్ మండల్ (వాటర్ పోలో, స్విమ్మింగ్), దిల్లీకి చెందిన నందినీ జైన్ (స్క్వాష్ క్రీడాకారిణి), ప్రభవ్ గుప్తా (టేబుల్ టెన్నిస్) ఉన్నారు.ప్రవేశం పొందడానికి అభ్యర్థులు తప్పనిసరిగా కామన్ ర్యాంక్ లిస్ట్ (సీఆర్ఎల్) లేదా జేఈఈ (అడ్వాన్స్డ్)లో కేటగిరీ వారీగా ర్యాంకుల జాబితాలో స్థానం పొందాలి. అదేవిధంగా గత నాలుగేళ్లలో ఏదైనా జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో కనీసం ఒక పతకమైనా సాధించి ఉండాలి.
ఐఐటీ మద్రాస్ మొట్టమొదటిసారిగా ‘స్పోర్ట్స్ ఎక్స్లెన్స్ అడ్మిషన్ (ఎస్ఈఏ)’ కోటా
By admin1 Min Read