ఇటీవల జరిగిన మొట్టమొదటి ఖోఖో వరల్డ్ కప్ లో భారత్ ఆతిథ్యం ఇవ్వడమే కాకుండా టోర్నీలో విజేతగా నిలిచి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఖోఖోకు మరింత ఖ్యాతి తీసుకురావాలనే వాదన క్రీడాభిమానుల నుండి వినిపోస్తోంది. ఇక తాజాగా 2036 ఒలింపిక్స్, ఆసియా క్రీడల్లో ఖోఖోను చేర్చడానికి సమిష్టి కృషి అవసరమని కేంద్ర క్రీడల మంత్రి మాన్సుఖ్ మాండవీయ తెలిపారు. మన క్రీడల్ని ప్రపంచం దృష్టికి తీసుకెళ్లాలన్న ఆలోచన ఉన్నట్లు స్పష్టం చేశారు. 2036 ఒలింపిక్స్లో ఖోఖోను ఆడించాలన్నది ప్రభుత్వ ప్రయత్నమని వివరించారు. ఇందుకోసం క్రీడాకారులు, కోచ్లు మంచి ప్రదర్శనలు ఇవ్వాలి. ఆటను ఫెడరేషన్ సమర్థంగా నిర్వహించాలి. క్రీడాకారుల ప్రదర్శన స్థాయిని పెంచడానికి క్రీడా మంత్రిత్వ శాఖ మద్దతు, సహకారం కొనసాగుతుందని చెప్పారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు