ముడి జనపనార(జూట్) కనీస మద్దతు ధరను పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఢిల్లీ లో తాజాగా జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశ నిర్ణయాలను మంత్రి వివరించారు. 2025-26 సీజన్ కు ముడి జూట్ క్వింటా ధరను రూ.5,650గా ఖరారుచేశారు. ఇది సాగువ్యయం కంటే 66.8% అదనమని కేంద్ర పీయూష్ గోయల్ తెలిపారు. 2014-15లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి క్వింటాలు ధర రూ. 2,400 ఉండేదని, ప్రస్తుత ధర దానికంటే 2.35 రెట్లు ఎక్కువని తెలిపారు. ఉత్పత్తి వ్యయంపై రైతులకు సగటున 66.8% మేర లాభం వస్తుందన్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ ను మరో ఐదు సంవత్సరాలు పొడిగించాలని కూడా కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఈ మిషన్ వలన గత పదేళ్లలో దేశవ్యాప్తంగా కోట్లమంది ప్రజలు ప్రయోజనం పొందినట్లు గోయల్ వివరించారు.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

