మహిళల అండర్-19 టీ20 ప్రపంచ కప్ లో భారత్ దూసుకుపోతోంది. తాజాగా జరిగిన సూపర్ సిక్స్ లో కూడా గెలిచింది. బంగ్లాదేశ్ పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 8 వికెట్లు కోల్పోయి 64 పరుగులు చేసింది. సుమేయ అక్తర్ 21 (29;1×4) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో వైష్ణవి శర్మ 3 వికెట్లతో సత్తా చాటింది. షబ్నమ్, గొంగడి త్రిష, జోషితా ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు. స్వల్ప లక్ష్యాన్ని భారత్ 7.1 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. గొంగడి త్రిష 40 (31; 8×4) రాణించింది. ఈ మ్యాచ్ విజయంతో భారత్ సెమీస్ చేరింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు