గతేడాది ‘దేవర’తో మంచి విజయాన్ని అందుకున్నారు అగ్ర నటుడు జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం ఆయన ‘కె.జి.ఎఫ్’, ‘సలార్’ వంటి భారీ చిత్రాలతో ఆకట్టుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చిత్రాన్ని చేస్తున్నారు. తాజాగా ఈచిత్రం షూటింగ్ ప్రారంభమైంది. ఈ విషయాన్ని చిత్ర బృందం ధ్రువీకరించింది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందనున్న ఈచిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇండియన్ సినిమా చరిత్రలో నిలిచిపోయే రీతిలో ఈచిత్రం రానుందని చర్చించుకుంటున్నారు. మంచి యాక్షన్ ఎంటర్టైనర్ గా సినీ ప్రియులను ఆకట్టకుంటోందని ఎన్టీఆర్ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు