మానవాళిపై ఈ శతాబ్దంలో అత్యంత ప్రభావం చూపిన కరోనా వైరస్ ను పోలినటువంటి మరో కొత్త వైరస్ ను చైనాలో గుర్తించారు. గబ్బిలాల్లో గుర్తించిన ఈ కొత్త వైరస్ను హెచ్కెయూ 5 – కోవ్ – 2గా పేర్కొన్నారు. ఇది కోవిడ్ 19కి కారణమైన సార్స్ – సీఓవీ 2ను పోలి ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ విషయాన్ని హాంకాంగ్కు చెందిన ఒక ప్రముఖ పత్రిక తన కథనంలో పేర్కొందని తెలుస్తోంది. ఇది జంతువుల నుండి మానవులకు సంక్రమించే ముప్పు ఉందని అయితే దీని సామర్థ్యం కోవిడ్ 19తో పోలిస్తే తక్కువేనని సైంటిస్ట్ లు అభిప్రాయపడుతున్నారు. గబ్బిలాల్లో కరోనా వైరస్ గురించి విస్తృత రీసెర్చ్ లు చేసిన ప్రఖ్యాత వైరాలజిస్ట్ షీ ఝెంగ్ లీ ఈ రీసెర్చ్ టీమ్ కు నేతృత్వం వహించారు. ఈ రీసెర్చ్ కు సంబంధించి పరిశోధనా పత్రం సెల్ జర్నల్లో రివ్యూకు ఉంచినట్లు కథనంలో పేర్కొన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు