ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా సేవలపై ఇటీవల కాలంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇటీవల ఎయిర్ ఇండియా విమానంలో విరిగిపోయిన సీటును తనకు కేటాయించారంటూ…కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ఎయిర్ ఇండియాపై అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.తాజాగా మరో బీజేపీ నాయకుడు జైవీర్ షెర్గిల్ సైతం ఎయిర్ ఇండియా సేవలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎయిర్ ఇండియాకు ‘చెత్త ఎయిర్లైన్స్’ విభాగంలో ఆస్కార్ అవార్డు ఇవ్వాలంటూ విమర్శించారు.ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టాడు.అయితే ఎయిర్ ఇండియాలో ప్రయాణం ఆహ్లాదకరమైన అనుభవం కాదని పేర్కొన్నారు.సంస్థ అన్ని రికార్డులను బద్దలు కొట్టిందని వ్యాఖ్యానించారు.‘చెత్త ఎయిర్లైన్స్ విభాగంలో ఎయిర్ ఇండియా అన్ని రికార్డులను బద్దలు కొట్టింది.ఈ విభాగంలో ఎయిర్లైన్స్కు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. విరిగిన సీట్లు, చెత్త సిబ్బంది దయనీయమైన గ్రౌండ్ సపోర్ట్ స్టాఫ్…అంటూ తన ట్వీట్లో పేర్కొన్నారు.
If there was an Oscar equivalent for WORST AIRLINES @airindia would win hands down in every category :
> Broken Seats
> Worst Staff
>Pathetic “on Ground” Support Staff
> Give two hoots attitude about customer service !Flying Air India is not a pleasant experience but today…
— Jaiveer Shergill (@JaiveerShergill) February 25, 2025

