ప్రతిష్టాత్మక దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ టైటిల్ విజేతగా విదర్భ నిలిచింది. రంజీ ట్రోఫీలో మూడో సారి ఈ ఘనతను సొంతం చేసుకుంది. తాజాగా జరిగిన ఫైనల్ లో కేరళపై మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా విదర్భకు విజేతగా నిలవగలిగింది. ఓవర్ నైట్ స్కోర్ 249/4తో ఐదో రోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన విదర్భ మ్యాచ్ ముగిసే సమయానికి 143.5 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 375 పరుగులు చేసింది. కరుణ్ నాయర్ 135 (295; 10×4, 2×6) సెంచరీతో రాణించాడు. కెప్టెన్ అక్షయ్ వడ్కర్ (25), దర్శన్ నల్కండే (51), అక్షయ్ కర్నేవర్ (30) పరుగులు చేశారు. కేరళ బౌలర్లలో ఆదిత్య సర్వాటే 4 వికెట్లతో ఆకట్టుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్ లో విదర్భకు 37 పరుగుల ఆధిక్యం లభించిన సంగతి తెలిసిందే. ఇక 2017-18, 2018-19 సీజన్ లలో విజేతగా నిలిచిన విదర్భ గత ఏడాది రన్నరప్ గా నిలిచింది. ఈ ఏడాది టైటిల్ దక్కించుకుంది.
విదర్భ మొదటి ఇన్నింగ్స్: 379.
విదర్భ రెండో ఇన్నింగ్స్:375-9.
కేరళ మొదటి ఇన్నింగ్స్:342.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు