సరిగ్గా 14 ఏళ్ల క్రితం, 2011 ఏప్రిల్ 2న, భారత క్రికెట్ జట్టు ముంబయిలోని వాంఖడే స్టేడియంలో చరిత్ర సృష్టించింది. శ్రీలంకను ఓడించి, 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ టీమిండియా రెండోసారి వన్డే ప్రపంచకప్ను ముద్దాడింది. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని భారత జట్టు ఈ విజయం సాధించగా, చివరి ఓవర్లో ధోనీ కొట్టిన అద్భుతమైన సిక్స్ మ్యాచ్ను ముగించింది.ఈ గొప్ప విజయాన్ని గుర్తుచేసుకుంటూ మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ తాజాగా స్పందించారు.ఈ మేరకు యువరాజ్ ఎక్స్ లో స్పందిస్తూ …“2011 ఏప్రిల్ 2—ఆ రాత్రి 100 కోట్ల మంది కోసం పోరాడాం.అది కేవలం విజయం మాత్రమే కాదు, భారత క్రికెట్ను భుజాలపై మోసిన లెజెండ్ సచిన్ టెండూల్కర్కు ఇచ్చిన అంకితమైన గొప్ప విజయం.14 ఏళ్లైనా ఆ రోజును తలుచుకుంటే ఇప్పటికీ గూస్బంప్స్ వస్తాయి” అంటూ భావోద్వేగపూరిత ట్వీట్ చేశారు.ఈ టోర్నమెంట్లో యువీ అసాధారణ ప్రదర్శన కనబరిచారు. బ్యాటింగ్,బౌలింగ్లో అద్భుతంగా రాణించి ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’ అవార్డును అందుకున్నారు. ముఖ్యంగా, క్యాన్సర్తో బాధపడుతూనే ప్రపంచకప్లో ఆడి,దేశానికి చిరస్మరణీయమైన విజయం అందించడం గమనార్హం. 2011 ప్రపంచకప్ విజయం భారత క్రికెట్ చరిత్రలో అజరామరంగా నిలిచిపోతుంది.
April 2, 2011 — the night we did it for a billion people… and for one man who carried Indian cricket on his shoulders for over two decades.
That World Cup wasn’t just a win. It was a thank you to a legend. We grew up watching @sachin_rt . That night, we played to give him the… pic.twitter.com/1U5J8Pt2dM
— Yuvraj Singh (@YUVSTRONG12) April 2, 2025