రాజస్థాన్ రాయల్స్:205-4 (20).
పంజాబ్ కింగ్స్: 155-9 (20).
ఐపీఎల్ -18: లో భాగంగా పంజాబ్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన నేడు న్యూ చండీఘర్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ 50 పరుగుల తేడాతో అలవోకగా విజయం సాధించింది. మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. యశస్వీ జైశ్వాల్ 67 (45; 3×4, 5×6) హాఫ్ సెంచరీతో తిరిగి ఫామ్ లోకి వచ్చాడు. సంజూ శాంసన్ 38 (26; 6×4), రియాన్ పరాగ్ 43 నాటౌట్ (25; 3×4, 3×6) , హెట్మేయర్ (20) పంజాబ్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచడంలో కీలక పాత్ర పోషించారు. పంజాబ్ బౌలర్లలో ఫెర్గుసన్ 2 వికెట్లు, మార్కో జాన్సన్, అర్ష్ దీప్ సింగ్ ఒక్కో వికెట్ తీశారు. ఇక లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. నేహాల్ వధేరా 62 (41; 4×4, 3×6), మ్యాక్స్ వెల్ (30) మినహా మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు, సందీప్ శర్మ 2 వికెట్లు, తీక్షణ 2 వికెట్లు, కార్తీకేయ, వనిందు హాసరంగ ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు