ఈ ఐపీఎల్ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ జట్టు సమిష్టిగా రాణిస్తూ మంచి ప్రదర్శన కనబరుస్తూ దూసుకుపోతోంది. తాజాగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో అన్ని విభాగాల్లో రాణించి 58 పరుగులతో విజయం సాధించింది. మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (82) మరోసారి కీలక ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. బట్లర్ (36), షారుక్ ఖాన్ (36), రాహుల్ తెవాటియా (24 నాటౌట్) పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో తుషార్ దేశ్ పాండే 2 వికెట్లు, తీక్షణ 2 వికెట్లు, జోఫ్రా ఆర్చర్ 1 వికెట్, సందీప్ శర్మ 1 వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనలో రాజస్థాన్ 19.2 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటయింది. హెట్మెయర్ (52), సంజు శాంసన్ (41), రియాన్ పరాగ్ (26) మినహా మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లలో ప్రసీద్ కృష్ణ 3 వికెట్లు, రషీద్ ఖాన్ 2 వికెట్లు, సాయి కిషోర్ 2 వికెట్లు, సిరాజ్, అర్షద్ ఖాన్, కుల్వంత్ ఒక్కో వికెట్ తీశారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు