యంగ్ టైగర్ ఎన్టీఆర్, పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న భారీ యాక్షన్ మూవీ షూటింగ్ ఎట్టకేలకు ప్రారంభమైంది.గతంలో ‘ఆర్ఆర్ఆర్’, ‘దేవర’ సినిమాలతో ఎన్టీఆర్ పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకోగా,ఇప్పుడు ఈ ప్రాజెక్ట్పై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఏప్రిల్ 22న ఎన్టీఆర్ కర్ణాటకకు వెళ్లి షూటింగ్లో పాల్గొనగా, ఎయిర్పోర్టులో ఆయన లుక్ ఫ్యాన్స్ను ఆకట్టుకుంది.స్టైలిష్ షర్ట్, కళ్లద్దాలు వేసుకున్న ఎన్టీఆర్ కొత్తగా మెరిశాడు.మైత్రీ మూవీ మేకర్స్,ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, రవిశంకర్,కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన వీడియోను చిత్ర బృందం “మారణహోమానికి ముందు ప్రశాంతత” అంటూ పోస్టు చేసింది.ప్రస్తుతం కర్ణాటకలో భారీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.ప్రశాంత్ నీల్ ఈ సినిమాలో ఎన్టీఆర్ను పూర్తిగా కొత్త మాస్ అవతారంలో చూపించబోతున్నారు.ఇప్పటికే హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో మొదటి షెడ్యూల్ పూర్తయింది.ఈ చిత్రం తారక్ కెరీర్లో మరో మైలురాయి అవుతుందన్న నమ్మకంతో అభిమానులు ఎదురు చూస్తున్నారు.
Two MASS ENGINES ready to wreck it all from tomorrow 💥💥#NTRNeel will shake the shorelines of Indian cinema 🔥🔥
MAN OF MASSES @tarak9999 #PrashanthNeel @MythriOfficial @NTRArtsOfficial @NTRNeelFilm @TSeries @tseriessouth pic.twitter.com/psHgfYWuF1
— Mythri Movie Makers (@MythriOfficial) April 21, 2025