ఉమెన్స్ ట్రై యాంగిల్ వన్డే సిరీస్ లో వరుసగా రెండు విజయాలు సాధించిన భారత జట్టు తాజాగా జరిగిన మ్యాచ్ లో ఓటమి పాలైంది. 3 వికెట్ల తేడాతో శ్రీలంక గెలుపొందింది. మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 9 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. రిచా ఘోష్ 58 (48; 5×4, 3×6) టాప్ స్కోరర్. జెమీమా రోడ్రిగ్స్ (37), ప్రతీక రావెల్ (35), హార్మన్ ప్రీత్ కౌర్ (30) పరుగులతో రాణించారు. శ్రీలంక బౌలర్లలో సుగంధిక 3 వికెట్లు, చమరి ఆటపట్టు 3 వికెట్లు తీశారు. ఇక లక్ష్యాన్ని శ్రీలంక నీలాక్షిక సిల్వా 56 (33; 5×4, 3×6), హార్షిత సమరవిక్రమ 53 (61; 5×4) హాఫ్ సెంచరీలతో రాణించారు. కలిసి (35), విష్మీ (33), అనుష్క (23 నాటౌట్ ) కీలక ఇన్నింగ్స్ లతో ఆకట్టుకున్నారు. దీంతో శ్రీలంక 49.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు