ఉరవకొండ నియోజకవర్గం, చాయాపురంలో హంద్రీనీవా సుజల స్రవంతి పనులను ఏపీ సీఎం చంద్రబాబు పరిశీలించారు. ఇంజనీర్లు, అధికారులను పనుల ప్రగతి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, అధికారులు కూడా సీఎం వెంట ఉన్నారు. హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్ట్ సమగ్ర రూపం, పనుల ప్రగతి, చిట్ట చివరి ప్రాంతాలకు ఎప్పటిలోగా నీరు అందిస్తారు? అనే వివరాలను అధికారులను అడిగి సీఎం చంద్రబాబు తెలుసుకున్నారు. హంద్రీనీవా సుజల స్రవంతి కాలువలో అధికారులతో పాటు దిగి పనులను పరిశీలించారు. ప్రాజెక్టు పనులను డ్రోన్లతో పర్యవేక్షిస్తున్న సిబ్బందిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు