ఉగ్రవాదానికి పాక్ మద్దతు నిలిపివేసే దాకా సింధూ జలాల ఒప్పందం నిలిపివేత కొనసాగుతుందని భారత్ స్పష్టం చేసింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన పాకిస్థాన్ దానికి తగిన మూల్యం చెల్లించక తప్పదని పేర్కొంది.ఆపరేషన్ సిందూర్ తదనంతర పరిణామాలపై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైశ్వాల్ మీడియా సమావేశంలో ఈ వివరాలు తెలిపారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ పరిష్కారానికి ద్వైపాక్షిక చర్చలే మార్గమని తెలిపింది. ఈ అంశంలో ఎలాంటి మధ్యవర్తిత్వాన్ని భారత్ అంగీకరించిందని పునరుద్ఘాటించింది. పాక్ పీవోకేని ఖాళీ చేయడమే మిగిలిందని వెల్లడించింది. కాల్పుల విరమణపై కూడా భారత్ తన వైఖరిని స్పష్టం చేసింది. ప్రపంచ దేశాల నుండి సంప్రదింపులు జరిపిన వారితోనూ ఇదే విషయాన్ని చెప్పామని ఉగ్రవాదులను అణచివేయడమే భారత్ ప్రాథమిక లక్ష్యమని పేర్కొన్నారు. ఉగ్రస్థావరాలపై భారత్ దాడి చేసింది. దానికి బదులుగా పాక్ దుస్సాహసానికి దిగిందని ఎండగట్టారు. ప్రతిచర్యగానే భారత్ దాడులు చేసిందని తెలిపారు .
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు